ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా విడుదల

  • ఈ వేసవిలో ఐపీఎల్ 15వ సీజన్
  • ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం
  • బెంగళూరు వేదికగా వేలం
  • మొత్తం 590 మంది ఆటగాళ్లతో వేలం జాబితా
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి వేలానికి 590 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు.

ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, కగిసో రబాడా, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, క్వింటన్ డికాక్ లకు గిరాకీ ఉండొచ్చని ఐపీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

IPL
Auction
Players List
Bengaluru
India

More Telugu News